లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ
byసూర్య |
Tue, Nov 21, 2023, 12:55 PM
కార్తీక మాసం పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుండే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి ప్రధాన ఆలయంలో నరసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
Latest News