తెలంగాణ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి

byసూర్య | Tue, Nov 21, 2023, 12:03 PM

తెలంగాణ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వే నేనంటూ రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్ షోలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావును అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. 


అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బండారి లక్ష్మారెడ్డి గెలుపునకు మద్దతుగా ఉప్పల్ రింగ్ రోడ్డులో సోమవారం సాయంత్రం కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎన్నికల ఇన్ చార్జి రావుల శ్రీధర్ రెడ్డి, బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పాల్గొని విజయవంతం చేశారు.


Latest News
 

తెలంగాణలో కొత్తగూడెం సఖి సెంటర్ కేసులో యువతి అదృశ్యం Tue, Feb 18, 2025, 12:42 PM
మురుగు నీటి సమస్యలు రానివ్వొద్దు : కార్పొరేటర్ పవన్ కుమార్ Tue, Feb 18, 2025, 12:38 PM
బీసీల జనాభా ఎందుకు తగ్గిందో సీఎం రేవంత్‌ చెప్పాలి: ఈటల Tue, Feb 18, 2025, 12:27 PM
మొయినాబాద్ కోడి పందేల కేసులో స్వాధీనం చేసుకున్న కోళ్లను వేలం వేసిన కోర్టు Tue, Feb 18, 2025, 10:48 AM
జోన్-3 సివర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనుల పరిశీలన Tue, Feb 18, 2025, 10:43 AM