చికిత్స పొందుతూ యువతి మృతి

byసూర్య | Mon, Nov 20, 2023, 03:09 PM

సిరికొండ మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన శీతల్(17) కొన్ని రోజుల నుంచి పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతోంది. తీవ్రత ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెందింది. ఈ క్రమంలో శనివారం బహిర్భూమికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. గ్రామానికి సమీపంలో పురుగుమందు తాగి వాంతులు చేసుకోవడంతో స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.


Latest News
 

కాసేపట్లో ఎమ్మెల్యేలతో కిషన్ రెడ్డి సమావేశం Sat, Dec 09, 2023, 11:21 AM
సోనియా బర్త్‌డే.. 78 కిలోల కేక్ క‌ట్ చేసిన రేవంత్ Sat, Dec 09, 2023, 11:15 AM
తెలంగాణ‌లో మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు Sat, Dec 09, 2023, 11:14 AM
బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ Sat, Dec 09, 2023, 11:13 AM
రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం Sat, Dec 09, 2023, 11:11 AM