byసూర్య | Mon, Nov 20, 2023, 02:16 PM
నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో ఆదివారం మునుగోడు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు బొల్లంపల్లి వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ బొల్లంపల్లి కవిత వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లంపల్లి సుధీర్, వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు, యువకులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.