byసూర్య | Mon, Nov 20, 2023, 02:14 PM
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని సాగర్ రోడ్డులో గల ఆంజనేయ హోటల్ లో ఆదివారం ఫ్లయింగ్ స్క్వాడ్ టీం జరిపిన సోదాల్లో 13 క్వార్టర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా విక్రయిస్తున్న మద్యాన్ని సీజ్ చేసి, హోటల్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్టు, పట్టుబడిన మద్యం విలువ రూ. 2570 రూపాయలు ఉంటుందని ఎస్సై వీరబాబు తెలిపారు.