byసూర్య | Sun, Sep 24, 2023, 12:18 PM
అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని సత్నాల బస్టాండ్ వద్ద గల చమన్ వాలే బాబా దర్గా షరీఫ్ లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అంతకుముందు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ తదితరులున్నారు.