'ఓట్‌ ఫ్రం హోం'.. వాళ్లకు మాత్రమే ఈ ఆప్షన్

byసూర్య | Fri, Sep 22, 2023, 08:09 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పార్టీల హాడావిడితో ఎన్నికల సందడి మొదలైనట్టే కనిపిస్తోంది. అభ్యర్థుల జాబితాలు, బహిరంగ సభలతో పార్టీలు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాయి. అయితే.. మధ్యలో జమిలీ ఎన్నికలు అన్న మాట తెరపైకి రావటంతో.. కొంత సందిగ్ధత నెలకొనగా.. అది ఈసారి సాధ్యమయ్యే పని కాదని తేలటంతో.. మళ్లీ యాథవిధిగా తమ పనుల్లో నిమగ్మయైపోయాయి. ఇదిలా ఉంటే.. కేంద్ర ఎన్నికల అధికారులు కూడా.. వచ్చే నెల మూడో తారీఖు నుంచి ఐదో తేదీ వరకు రాష్ట్రంలో పర్యటించి.. ఎలక్షన్ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. దీంతో.. షెడ్యూల్ ప్రకారమే.. డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలోనే.. ఈసీ సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగానే.. "ఓట్ ఫ్రం హోమ్" అనే ఆప్షన్‌ను తెలంగాణ ఎన్నికల్లో తీసుకురావాలని కసరత్తు చేస్తున్నారు. మొదటిసారిగా.. కర్ణాటక ఎన్నికల్లో ఈ ఓట్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేశారు. అక్కడ విజయవంతం కావడంతో తెలంగాణ ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అయితే.. ఈ ఆప్షన్ కేవలం 80 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమేనని అధికారులు చెప్తున్నారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యం కల్పించనున్నారు. వాళ్లకే కాకుండా.. దివ్యాంగులకు కూడా ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించాలని ఈసీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


ఈ క్రమంలోనే.. తెలంగాణలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు మొత్తం ఎంత మంది ఉన్నారనే దానిపై తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సీఈసీ సమాచారం పంపింది. ప్రస్తుతం.. తెలంగాణలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 4,87,950 మంది ఉన్నట్టుగా అధికారుల దగ్గర సమాచారం ఉంది. కాగా.. వీళ్ల కోసం పోస్టల్ బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని సీఈసీ సూచించింది. అయితే.. 80 ఏళ్లు దాటినవారు ఇంటి నుంచే ఓటు వేయాలనుకుంటే మొదటగా.. తమ ప్రాంత ఎన్నికల అధికారికి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అధికారులు పోస్టల్ బ్యాలెట్లను సిద్ధం చేస్తారు. ఈ విధానాన్ని తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగే మిగతా రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఈసీ ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా రాష్ట్రాల్లోనూ 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM