byసూర్య | Fri, Sep 22, 2023, 03:44 PM
నల్లకుంట డివిజన్ లోని రైల్వే ట్రాక్ పక్కన గల కుట్టి లైన్లో రూ.75 లక్షల వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులకు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ అమృత కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దశల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులతో అంబర్ పేట నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయని, కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.