byసూర్య | Thu, Sep 21, 2023, 03:39 PM
పట్టాలు దాటుతున్న ఓ వృద్ధురాలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొనడంతో అక్కడికకక్కడే మృతి చెందింది. సికింద్రాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ పండరీ తెలిపిన వివరాల ప్రకారం. గౌడవెల్లి గ్రామానికి చెందిన దిల్ కుమారి పరియార్ (71) బుధవారం మెడ్చల్ ప్రాంతంలో రైలు పట్టాలు దాటుతుండగా సికింద్రాబాద్ వైపు వస్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.