byసూర్య | Thu, Sep 21, 2023, 03:13 PM
దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేనన్ని పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలుస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం పాపన్నపేట మండల పరిధిలోని శానాయిపల్లి, క్యాతండా గ్రామాల్లో పంచాయతీ భవనాలు, జయపురంలో అంగన్వాడి భవనం ప్రారంభించారు. జయపురంలో ఎస్సీ కమ్యూనిటీ భవనం, బీసీ ముదిరాజ్ కమ్యూనిటీ భవనాల పనులకు శంకుస్థాపన చేశారు.