byసూర్య | Thu, Sep 21, 2023, 03:11 PM
రెండో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి లిఫ్ట్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం వైపు నుంచి పెద్ద గోల్కోండ ఓఆర్ఆర్ వైపు మంత్రి వెళుతుండగా.. దారిలో గొల్లూరు తండాకు చెందిన 2వ తరగతి బాలికలు కాలినడకన ఇంటికెళుతూ కనిపించారు. దీంతో మంత్రి సబిత వారిని కారులో ఎక్కించుకుని ఇంటి వద్ద దిగబెట్టారు. ఇది తెలుసుకుని తండావాసులు మురిసిపోయారు.