byసూర్య | Thu, Sep 21, 2023, 03:11 PM
ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో రూ. 2. 95 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపనలు చేశారు. 19వ డివిజన్ లో రు. 90 లక్షలు, 16వ డివిజన్ లో రూ. 1. 20 కోట్లు, 14వ డివిజన్ లో ఎల్ఆర్ఎస్ నిధులు రూ. 85లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా త్వరగా పూర్తి చేయాలని సూచించారు.