byసూర్య | Thu, Sep 21, 2023, 03:12 PM
ఖమ్మం నగరం ఎన్ఎస్టీ రోడ్ నందు శ్రీగణేష్ ఉత్సవ కమిటీ అధ్వర్యంలో ప్రతిష్టించిన గణేష్ మండపాన్ని గురువారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కమిటీ అధ్వర్యంలో ఎర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు యాదవ్, కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.