byసూర్య | Thu, Sep 21, 2023, 03:02 PM
కరీంనగర్ పట్టణంలోని గురువారం తెలంగాణ ఉద్యమ నేత, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ స్థానిక పట్టణంలోని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవల్ని స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ, తన జీవితాంతం బలహీన వర్గాల కోసం సేవ చేసిన ఘనత ఆయనదని ప్రశంసించారు.