byసూర్య | Thu, Sep 21, 2023, 01:04 PM
దేశంలో ఎక్కడా లేని అనుకూలతలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో బీఎస్వీ కంపెనీ కొత్త యూనిట్కు గురువారం కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ సీరం సంస్థకు అన్ని రకాల సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో ఫేజ్-3లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని వెల్లడించారు.