byసూర్య | Thu, Sep 21, 2023, 12:46 PM
టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. దసరా ప్రయాణానికి ముందస్తు టిక్కెట్ బుకింగ్పై 10 శాతం తగ్గింపును టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అక్టోబరు 15 నుంచి 29వ తేదీలోపు బయలు దేరిన వారికి, చేరుకోవడానికి టిక్కెట్లు బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో 10 శాతం రాయితీ.. ఈ నెల 30లోపు టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.