byసూర్య | Wed, Sep 20, 2023, 02:55 PM
యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బస్సులో 33 మంది ప్రయాణికులుండగా, ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. మృతులు పంచాయితీ కార్యదర్శి కొండా రాములు, చిన్న పడిశాలకు చెందిన చుక్క యాకమ్మగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్థులు క్షతగాత్రులను భువనగిరి ఆస్పత్రికి తరలించారు.