byసూర్య | Wed, Sep 20, 2023, 02:26 PM
చిలుకూరు మండల కేంద్రంలో మంగళవారం రైతులు విద్యుత్ కోతలకు నిరసనగా కోదాడ జడ్చర్ల జాతీయ రహదారి పై విద్యుత్ ఉపకేంద్రం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం 24 గంటలు ఉచిత విద్యుత్ అందజేస్తామని చెప్పి కనీసం 10 గంటలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. స్థానిక ఎస్సై శ్రీనివాస్ యాదవ్ తన స్థలానికి చేరుకొని ట్రాన్స్ కో ఏఈ, డిఇ లతో సంప్రదించి రాస్తారోకో విరమింప చేశారు.