byసూర్య | Wed, Sep 20, 2023, 02:59 PM
మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం గృహలక్ష్మి పథకం కింద మొదటి విడతలో మంజూరు అయిన 66మంది లబ్ధిదారులకు మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.