byసూర్య | Wed, Sep 20, 2023, 02:24 PM
ఘట్కేసర్ మండల్ ఎదులాబాద్ గ్రామంలో పశువైద్య & పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) వారి సౌజన్యంతో బుధవారం ఉచిత పశువుల ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా పాడి పశువుల రైతులకు ఉచిత మందులను అందజేశారు.