byసూర్య | Thu, Jun 08, 2023, 04:18 PM
తెలంగాణలో సమీకృత అభివృద్ధి కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. మహబూబ్నగర్ జిల్లా వేముల లో గురువారం ఎస్ఓడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీ ప్లాంట్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.