byసూర్య | Thu, Jun 08, 2023, 04:18 PM
ఈనెల 10వ తేదీ న కోర్టు ప్రాంగణంలోజరగబోతున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులందరూ సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి డి. రాజేష్ బాబు గురువారం ఒక ప్రకటనలో కోరారు. రాజీపడ దగిన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, బ్యాంకు కేసులు, కుటుంబ వివాద కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులుతో పాటు చెక్ బౌన్స్ కేసులను కూడా ఈలోక్ అదాలత్ లో సామరస్య పూర్వకంగా పరిష్కరించుకో వచ్చునన్నారు. అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.