byసూర్య | Thu, Jun 08, 2023, 02:59 PM
సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా వేములలో ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీ ప్లాంట్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి అనేక పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని మంత్రి తెలిపారు.