byసూర్య | Thu, Jun 08, 2023, 12:18 PM
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పీపుల్స్ మార్చ్ మహా పాదయాత్ర గురువారం నాటికి 84వ రోజుకి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని పాతూరి తండా గ్రామం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కాగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.