byసూర్య | Thu, Jun 08, 2023, 12:17 PM
ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు గురువారం కల్లూరు పట్టణానికి చెందిన మన్నే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వేసవి కాలంలో ఆర్టీసీ ప్రయాణం చేసే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు 300 మందికి ఉచిత మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు, స్థానిక పట్టణ ప్రముఖులు దాతల మానవతా దృక్పథం పట్ల హర్షం వ్యక్తం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.