byసూర్య | Thu, Jun 08, 2023, 10:34 AM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ శ్రీ హరిహర అభయ ఆంజనేయ స్వామి దేవాలయ అష్టమ వార్షిక బ్రహ్మోత్సవంలో గురువారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. స్వామి వారి కృప ప్రజలందరిపై తప్పక ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.