ఒక్కరోజు ఎస్సైగా క్యాన్సర్ బాధితురాలు,,,చివ్వెలం పోలీస్ స్టేషన్‌లో అరుదైన దృశ్యం

byసూర్య | Wed, Jun 07, 2023, 08:30 PM

సూర్యాపేట పోలీసులు ఓ క్యాన్సర్ బాధితురాలి చిరకాల కోరికను నెరవేర్చారు. ఒక్కరోజైనా ఎస్సైగా ఉండాలన్న ఆమె కలను నిజం చేశారు. వన్ డే ఎస్‌ఐగా ఆమెకు అవకాశం కల్పించారు. మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో యువతి తన కలను నెరవేర్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన్ తండాకు చెందిన ధరావత్ స్వాతికి నాలుగేళ్ల క్రితం క్యాన్సర్ సోకింది. పేదరికంలో మగ్గుతున్న ఆమె కుటుంబం వైద్యం కోసం ఎక్కడెక్కడో తిప్పారు. అయినా.. ఆమెకు నయం కాలేదు. ఉన్నకొద్దిపాటి పొలాన్ని అమ్మేసి వైద్యం చేయించినా.. క్యాన్సర్ జబ్బు తగ్గలేదు.


అయితే ఆమెకు చిన్నప్పటి పోలీసు ఆఫీసర్ కావాలనే కోరిక ఉంది. ఒక్కరోజైనా పోలీస్ యూనిఫాం వేసుకొని డ్యూటీ చేయాలని కలలు కనేది. ఈ నేపథ్యంలో ఆమె విషయాన్ని నియోజవర్గానికి చెందిన నాయకులు మంత్రి జగదీశ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి.. సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయానికి స్వాతితో పాటు కుటుంబ సభ్యుల్ని పిలిపించుకున్నారు. వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసి.. మనో ధైర్యంతో ఉండాలని స్వాతికి సూచించారు. ధైర్యంగా ఉంటే ఏ రోగాలు మనల్ని ఏం చేయలేవని స్వాతికి ధైర్యం చెప్పారు.


స్వాతి కుటుంబ సభ్యుల పరిస్థితిని చూసి మంత్రి చలించిపోయారు. ఆమె తండ్రి ధరావత్ చింప్లా పక్షవాతానికి గురి కాగా.. ఆయనకు అయ్యే వైద్య ఖర్చులను తానే భరిస్తానని చెప్పాడు. అవసరమైన వైద్య సాయం అందిస్తానని హామీ ఇచ్చాడు. ఇదిలా ఉడంగా.. పోలీసు కావాలన్న తన చిరకాల కోరికను స్వాతి మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన మంత్రి జగదీశ్ రెడ్డి ఆమె కలను నెరవేర్చాలని సూచించాడు.


మంత్రి ఆదేశం మేరకు స్వాతి చివ్వెంల పోలీసు స్టేషన్‌లో నిన్న( మంగళవారం) ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టింది. ఒక్కరోజు ఎస్‌ఐగా డ్యూటీ చేసింది. క్రైం బుక్, స్టేషన్ నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ ఇలా అన్ని విషయాలను అక్కడి సిబ్బంది ఆమెకు వివరించారు. ఇలా మంత్రి సహకారంతో స్వాతి తన చిరకాల కోరికను నేరవేర్చుకుంది.



Latest News
 

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నేతలు.. ఎంతటివారైనా విడిచిపెట్టం.. సీపీ సంచలన వ్యాఖ్యలు Fri, Apr 26, 2024, 07:46 PM
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ. Fri, Apr 26, 2024, 07:42 PM
మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్ అన్నా.. ఈటలకు హగ్ ఇచ్చి ప్రేమతో చెప్పిన మల్లారెడ్డి Fri, Apr 26, 2024, 07:39 PM
చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు Fri, Apr 26, 2024, 07:27 PM