byసూర్య | Wed, Jun 07, 2023, 08:30 PM
కళ్యాణాలక్మి, షాది ముబారక్ పథకాలతో పేదింటి అడబిడ్డల వివాహాలకు కొండంత అండగా ఉంటుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు మహేశ్వరం లో 65 మంది లబ్ధిదారులకు కళ్యాణాలక్మి చెక్కులను అందజేసారు.నూతన జంటలకు శుభాకాంక్షలు తెల్పిన మంత్రి మాట్లాడుతూ ఒక మేన మామ లాగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లక్ష రూపాయల సహాయం అందిస్తున్నారన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి,మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.