కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ఎయిర్‌పోర్టు మెట్రో మూడేళ్లలో పూర్తి: మంత్రి కేటీఆర్

byసూర్య | Tue, Mar 28, 2023, 04:41 PM

కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ఎయిర్‌పోర్టు మెట్రోను మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేస్తామని తెలిపారు. యూపీ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని, కానీ హైదరాబాద్ మెట్రోకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. మెట్రోకు నిధులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు.


హైదరాబాద్‌లోని ఖాజాగూడలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ అభివృద్ధి అంతకంతకూ పెరుగుతోందని, యూఎస్‌లోని నగరాలను హైదరాబాద్ మించిపోతుందని ఇతర దేశాల్లో ఉన్న మిత్రులు అంటున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. గుంటూరు, విశాఖ, విజయవాడ కూడా బాగున్నాయని వ్యాఖ్యానించారు. నిర్మాణరంగ సంస్థలు చెరువులను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం అభినందనీయమని ప్రశంసించారు.


సీఎస్‌ఆర్ నిధులతో హైదరాబాద్‌లో చెరువుల అభివృద్ధి చేస్తున్నామని, దుర్గం చెరువు టూరిస్ట్ స్పాట్‌గా మారిందని కేటీఆర్ అన్నారు. 50 చెరువుల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉన్నాయని, ఈ మధ్య కాలంలో దుర్గం చెరువు లేని సినిమా లేదన్నారు. హైదరాబాద్ కెనడాలా ఉందని తన ఫ్రెండ్స్ అన్నాడని, హైదరాబాద్‌కు అతిపెద్ద వరం మూసీ అని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, సిటీలోని చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.


దేశంలోనే అతిపెద్ద అథారిటీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ అని కేటీఆర్ తెలిపారు. అమరావతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కొనసాగితే దేశంలో అతి పెద్దదిగా ఉండేదన్నారు. అమరావతిలో పనులు నిలిచిపోవడం వల్ల హెచ్‌ఎండీఏనే పెద్దదని కేటీఆర్ అన్నారు. చెరువులను అభివృద్ధి కోసమే ఇస్తున్నామని, ఎవరికీ రాసివ్వడం లేదన్నారు. దీని గురించి అడ్డమైన వార్తలు రాయవద్దని కేటీఆర్ సూచించారు. ఫ్యామిలీ మొత్తం వచ్చి సేద తీరేలా చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.



Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM