byసూర్య | Tue, Mar 28, 2023, 02:34 PM
మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో తాజాగా రామోజీరావుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. మార్గదర్శిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల కేసులో ఏపీ సీఐడీ A1గా రామోజీరావు, A2గా చెరుకూరి శైలజను పేర్కొంది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం శైలజకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. తాజాగా రామోజీరావుకు కూడా నోటీసులిచ్చింది. మార్చి 29, 31, ఏప్రిల్ 3, ఏప్రిల్ 6 తేదీల్లో ఒకరోజు విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొంది.