ఏబీవీపీ కార్యకర్తలను తరలిస్తోన్న డీసీఎం డ్రైవర్‌కు ఫిట్స్,,,ప్రాణాలకు తెగించి కంట్రోల్ చేసిన ఎస్సై

byసూర్య | Tue, Mar 21, 2023, 07:50 PM

హైదరాబాద్‌ బంజారాహిల్స్ ఎస్సై.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 16 మంది ప్రాణాలు కాపాడి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రగతి భవన్ వద్ద ముట్టడికి వచ్చిన 16 మంది ఏబీవీపీ కార్యకర్తలని పోలీసులు అరెస్టు చేసి డీసీఎంలో ఖైరతాబాద్ వైపు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో డీసీఎం నడుపుతున్న హోంగార్డు రమేష్‌‌కి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. దీంతో డీసీఎం అదుపుతప్పి డివైడర్ మీదికి దూసుకు వెళ్తున్న సమయంలో బంజారాహిల్స్ ఎస్సై కరుణాకర్ రెడ్డి గమనించాడు. వెంటనే తన వాహనంలో నుంచి కిందికి దూకి.. ప్రాణాలకు తెగించి డీసీఎం వాహనాన్ని కంట్రోల్ చేశాడు. ఎస్సై కరుణాకర్ రెడ్డి సమయస్ఫూర్తితో స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.


ఈ క్రమంలో ఎస్సైకి, డీసీఎంలో ఉన్న ఓ కానిస్టేబుల్ సాయికుమార్‌కు గాయాలయ్యాయి. గాయపడిన ఎస్సై కరుణాకర్ రెడ్డి, హోంగార్డు రమేష్‌ను వెంటనే యశోద హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించాడు. ప్రస్తుతం హోంగార్డ్ రమేష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఎస్సై కరుణాకర్ రెడ్డి వాహనాన్ని కంట్రోల్ చేయకపోతే పెద్ద ప్రమాదం జరిగేదని.. వెంటనే అప్రమత్తమై ప్రమాదం జరగకుండా అందర్నీ కాపాడిన కరుణాకర్ రెడ్డిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రాణాలతో బయటపడ్డ 16 మంది ఏబీవీపీ కార్యకర్తలు కూడా ఎస్సై కరుణాకర్ రెడ్డి చేసిన సాహసానికి ప్రశంసల వర్షం కురిపించారు.



Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM