అన్నతో కలసి ఢిల్లీ పయనమైన ఎమ్మెల్సీ కవితా

byసూర్య | Sun, Mar 19, 2023, 06:32 PM

ఈడీ నోటీసులతో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితా తన అన్న మంత్రి కేటీఆర్ తో కలసి ఢిల్లీ పయనమయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు (మార్చి 20) ఢిల్లీలో ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, సోదరుడు కేటీఆర్ తో కలిసి కవిత ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తరలి వెళ్లారు. వారి వెంట బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. ఇదిలావుంటే మహిళను ఈడీ కార్యాలయంలో విచారించడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రేపటి ఈడీ విచారణకు ఆమె వ్యక్తిగతంగా హాజరవుతారా, లేక తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అటు, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది.



Latest News
 

నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత Tue, Apr 16, 2024, 12:31 PM
ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రేట్లు Tue, Apr 16, 2024, 12:27 PM
బాసర ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య Tue, Apr 16, 2024, 12:26 PM
స్కూల్ వ్యాను కింద పడి చిన్నారి మృతి Tue, Apr 16, 2024, 12:23 PM
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం Tue, Apr 16, 2024, 11:46 AM