అన్నతో కలసి ఢిల్లీ పయనమైన ఎమ్మెల్సీ కవితా

byసూర్య | Sun, Mar 19, 2023, 06:32 PM

ఈడీ నోటీసులతో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితా తన అన్న మంత్రి కేటీఆర్ తో కలసి ఢిల్లీ పయనమయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు (మార్చి 20) ఢిల్లీలో ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, సోదరుడు కేటీఆర్ తో కలిసి కవిత ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తరలి వెళ్లారు. వారి వెంట బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. ఇదిలావుంటే మహిళను ఈడీ కార్యాలయంలో విచారించడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రేపటి ఈడీ విచారణకు ఆమె వ్యక్తిగతంగా హాజరవుతారా, లేక తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అటు, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది.



Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM