అన్నతో కలసి ఢిల్లీ పయనమైన ఎమ్మెల్సీ కవితా

byసూర్య | Sun, Mar 19, 2023, 06:32 PM

ఈడీ నోటీసులతో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితా తన అన్న మంత్రి కేటీఆర్ తో కలసి ఢిల్లీ పయనమయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు (మార్చి 20) ఢిల్లీలో ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, సోదరుడు కేటీఆర్ తో కలిసి కవిత ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తరలి వెళ్లారు. వారి వెంట బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. ఇదిలావుంటే మహిళను ఈడీ కార్యాలయంలో విచారించడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రేపటి ఈడీ విచారణకు ఆమె వ్యక్తిగతంగా హాజరవుతారా, లేక తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అటు, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది.



Latest News
 

51 అడుగులకు చేరిన నీటిమట్టం Sat, Jul 27, 2024, 09:05 AM
రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM