కవితా పిటిషన్ కు కౌంటర్ గా.... కోర్టులో ఈడీ కేవియెట్ దాఖలు ధాఖలు

byసూర్య | Sun, Mar 19, 2023, 05:13 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితా దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్  గా ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడంపై కవిత సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ వేయగా, ఆ పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది. ఈ పిటిషన్ విచారణకు రాకముందే ఈడీ కేవియెట్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత పిటిషన్ పై ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని ఈడీ సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని ఈడీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.



Latest News
 

51 అడుగులకు చేరిన నీటిమట్టం Sat, Jul 27, 2024, 09:05 AM
రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM