కవితా పిటిషన్ కు కౌంటర్ గా.... కోర్టులో ఈడీ కేవియెట్ దాఖలు ధాఖలు

byసూర్య | Sun, Mar 19, 2023, 05:13 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితా దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్  గా ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడంపై కవిత సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ వేయగా, ఆ పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది. ఈ పిటిషన్ విచారణకు రాకముందే ఈడీ కేవియెట్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత పిటిషన్ పై ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని ఈడీ సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని ఈడీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.



Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM