ఎన్‌ఎండీసీ సీఎండీగా శ్రీధర్‌ నడిమట్ల,,త్వరలోనే బాధ్యతల స్వీకరణ

byసూర్య | Sun, Mar 19, 2023, 02:28 PM

తెలంగాణ నల్లబంగారంగా పేరుగాంచిన ప్రస్తుతం సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్‌ సీఎండీగా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీధర్‌ నడిమట్ల జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అండ్ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులు కానున్నారు. ఆ పోస్టుకు ఆయన పేరును సిఫార్సు చేస్తూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ శాఖ ఆధ్వరంలోని పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలెక్షన్‌ బోర్డు (PESB) శనివారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గతేడాది ఎన్‌ఎండీసీ సీఎండీ పోస్టుకోసం పీఈఎస్బీ నుంచి నోటిఫికేషన్‌ వెలువడింది.


ఎన్‌ఎండీసీ సీఎండీ బాధ్యతలు తాత్కాలికంగా నిర్విహిస్తున్న అమితవ ముఖర్జీతో పాటు ఎంఓఐఎల్‌ మానవ వనరుల విభాగం డైరెక్టర్‌ ఉషాసింగ్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాజీవ్‌ సోని, ఆర్‌వీఎన్‌ఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సరోజ్‌ కాంత పాత్ర, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ రాకేష్‌ తుమానె, ఇండియన్‌ రైల్వేస్‌ స్టోర్స్‌ సర్వీస్‌ హయ్యర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ అధికారి అశోక్‌కుమార్‌ వర్మ, సింగరేణి సీఎండీ శ్రీధర్‌ నడిమట్ల దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు చాలా మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు దరఖాస్తు చేసుకోగా..ఈ ఏడుగురిని షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు తెలుస్తుంది.


వీరికి శనివారం ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు ఆన్‌లైన్‌లోనే ఇంటర్వ్యూ నిర్వింహించారు. చివరికి ఎన్‌ఎండీసీ సీఎండీగా శ్రీధర్‌ పేరును సిఫార్సు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. పీఈఎస్బీ తన సిఫార్సును కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది. అక్కడి నుంచి కేంద్ర కేబినెట్ ద్వారా ప్రధాని వద్దకు ఈ ఫైలు చేరుతుంది. ప్రధాని మోదీ సంతకం చేయడంతో అధికారికంగా అపాయింట్‌మెంట్‌ ఉత్తర్వులు వెలువడనున్నాయి. హైదరాబాద్ లక్డీకపూల్‌లో ఎన్‌ఎండీసీ ప్రధాన కార్యాలయం ఉండగా.. దేశంలోనే అత్యధిక ఐరన్‌ ఓర్‌ను వెలికితీసే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా దీనికి గుర్తింపు ఉంది. ఎన్‌ఎండీసీ సీఎండీగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.


సింగరేణి సీఎండీగా శ్రీధర్ నడిమట్ల సుదీర్ఘకాలంగా పని చేస్తున్నారు. 2015 జనవరి 1న శ్రీధర్ సీఎండీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. గతేడాది డిసెంబర్ 31న ఆయన పదవి కాలం ముగియగా.. మరో ఏడాది పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1997 బ్యాచ్‌ తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శ్రీధర్‌.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందు అనంతపురం, కృష్ణా, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్‌గానూ, రాజమండ్రి సబ్‌ కలెక్టర్‌గా, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ పీవోగా, కాకినాడ పోర్ట్స్‌ డైరెక్టర్‌గానూ సేవలందించారు.



Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM