ఆర్టీసి కార్గో ద్వారా భద్రాచల సీతారామచంద్ర స్వామి తలంబ్రాలు

byసూర్య | Sun, Mar 19, 2023, 11:26 AM

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచల సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవ తలంబ్రాలను కార్గో సర్వీస్ ద్వారా ప్రజలకు అందజేయనున్నట్లు సిద్దిపేట ఆర్టీసీ డీపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి శనివారం తెలిపారు. భద్రాచలం వెళ్లలేని వారు శ్రీరాముడి కల్యాణ తలంబ్రాల కోసం రూ. 116 చెల్లిస్తే ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే పంపిస్తామని పేర్కొన్నారు. తలంబ్రాలు అవసరమున్న వారు సిద్దిపేట ఆర్టీసీ కార్గో కౌంటర్లో సంప్రదించాలన్నారు. ఒకే కాలనీ లేదా ప్రభుత్వ కార్యాలయానికి చెందిన 30 మంది ఆసక్తిగా ఉంటే, బుకింగ్ కోసం ఆర్టీసీ సిబ్బందిని వారి వద్దకే పంపిస్తామన్నారు. వివరాలకు 7382875119 అనే ఫోన్ నంబర్ లో సంప్రదించాలన్నారు.


Latest News
 

51 అడుగులకు చేరిన నీటిమట్టం Sat, Jul 27, 2024, 09:05 AM
రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM