![]() |
![]() |
byసూర్య | Sat, Mar 18, 2023, 07:56 PM
కామారెడ్డి జిల్లా పిట్లం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం మద్దెల చెరువు గ్రామానికి చెందిన రేష్మ బెగం భర్త షేక్ మౌలనకు 54, 000 చెక్కును అందచేసినట్లు ఎంపీపీ కవిత విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎంతో మంది నిరుపేదలు లబ్ది పొందారాని తెలిపారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ పథకాన్ని కేసీఆర్ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ సాయిరెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ ఒంటరి శపథం రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దేవేందర్ దొర, సర్పంచ్ పండిత్ రావ్, శ్రీకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.