byసూర్య | Wed, Feb 01, 2023, 07:50 PM
కేంద్ర ఆర్థిక మంత్రి బుధవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్ వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకమైనది గా ఉందని నిరసిస్తూ బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌరస్థ లో బడ్జెట్ ప్రతులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నలవెల్లి కురుమూర్తి, ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం నారాయణ గౌడ్ మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ లో నిధులు తగ్గించారని విమర్శించారు. దీనిలో నాయకులు హనుమంతు చంద్రశేఖర్, వెంకటేష్, కృష్ణయ్య, అనిత తదితరులు పాల్గొన్నారు.