గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
byసూర్య |
Thu, Jan 26, 2023, 12:30 PM
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చింతల్ 128 డివిజన్ పరిధిలోని గురువారం హెచ్. ఎం. టి లోని నిర్మాణ్ మానసిక వికలాంగుల కేంద్రంలో సేవా మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మానసిక వికలాంగులకు స్వీట్లు, పండ్లు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో నిర్మాణ్ సంస్థ నిర్వాహకులు, సేవా మిత్ర ఫౌండేషన్ సభ్యులు రమేష్, విజయ్, శ్రీనివాస్, శ్రీధర్ రావ్, నర్సింహా, రాజు తదితరులు పాల్గొన్నారు.
Latest News