byసూర్య | Wed, Jan 25, 2023, 02:46 PM
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధిలోని పంజుగుల గ్రామంలో బుధవారం ఉదయం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కుని వినియోగించుకుంటాం అని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఓటు హక్కు పై అవగాహన కల్పించి అర్హులైన ప్రతి యెక్క యువకుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి ఓటు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అలివేల కళావతి యువజన కాంగ్రెస్ కల్వకుర్తి మండల ప్రధాన కార్యదర్శి పర్శపాకుల రమేష్ బిఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ రాముడు పాండు కృష్ణయ్య జంగయ్య తదితరులు పాల్గొన్నారు.