విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

byసూర్య | Wed, Jan 25, 2023, 02:43 PM

కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండల పరిధిలోని కలకొండ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జిల్లా పరిషత్ పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 215 మంది విద్యార్థులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ఆయన ట్రస్ట్ ద్వారా సొంత ఖర్చులతో విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం వల్ల విద్య ఆగిపోరాదు. పేదరిక నిర్మూలన జరగాలంటే చదువు ఒక్కటే మార్గమని ప్రతి ఒక్కరు బాగా చదువుకొని మీ కన్న తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి ఎంపిపి తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్ గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి తలకొండపల్లి మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్ నర్సంపల్లి సర్పంచ్ హనుమాన్ నాయక్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విష్ణు వర్దన్ రెడ్డి రామలింగం శృతిలయ అకాడమీ చైర్మెన్ చిత్తరంజన్ దాస్ హై స్కూల్ విద్యాకమిటీ చెర్మెన్ పాపయ్య ఉప సర్పంచ్ లాలమ్మ వార్డ్ మెంబర్ సభ్యులు మల్లేష్ నగేష్ వెంకటేష్ విజేష్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM