byసూర్య | Wed, Jan 25, 2023, 11:54 AM
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారం ఫరూఖ్ నగర్ మండలం కాశిరెడ్డి గూడ గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం 3. 37 లక్షలతో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణం, 20 లక్షలతో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంకు, 14. 60 లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, కంపోస్టు యార్డు, 20 లక్షలతో నిర్మించిన అంతర్గత మురుగుకాలువలు, సి. సి రోడ్లు, ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అభివృద్ధి సంక్షేమ పథకాలతో గ్రామాలని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని అన్నారు. తెలంగాణ సర్కార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో గతంలో ఎన్నడు లేని విధంగా గ్రామాలను అభివృద్ధిని సాధించాయన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వాములు కావాలన్నారు.