byసూర్య | Wed, Jan 25, 2023, 11:33 AM
పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో తొగుట మండలం జప్తి లింగారెడ్డి పల్లి గ్రామంలో కోదండ శివలక్ష్మి కు 16 వేలు, ఎన్నం అనసూయ కు 14 వేల రూపాయల చెక్కులను మంగళవారం స్థానిక నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ బిఆర్ఎస్ మండల పార్టీ ప్రెసిడెంట్ చిలువేరి మల్లారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య, పులిందర్ రెడ్డి, యాదవ రెడ్డి, నరసింహులు, నాగరాజు, రమేష్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.