byసూర్య | Tue, Jan 24, 2023, 02:42 PM
ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులను అప్ గ్రేడ్ చేయాలని ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా మమ్మదాబాద్ మండల పరిధిలోని జూలపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మంగళవారం భోజన విరామ సమయంలో తమ నిరసన వ్యక్తం చేశారు. భాషా పండితులను పీఈటిలను అప్ గ్రేడ్ చేయాలని నల్ల బ్యాడ్జీలు ధరించి తమ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.