byసూర్య | Thu, Dec 08, 2022, 10:49 AM
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి , కమిషనర్ లోకేష్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు సమస్యలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు చర్చించారు. పలు అభివృద్ధి పనులకు మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచనల మేరకు స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు.