క్రైస్తవుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది :కేపి వివేకానంద్

byసూర్య | Thu, Dec 08, 2022, 10:48 AM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి చౌరస్తా వద్ద యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఆఫ్ బాచుపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఐక్య క్రిస్మస్ సందడి‘ వేడుకల్లో బుధవారం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి , డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు కులాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సముచిత గౌరవం కల్పిస్తున్నారని. అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలు జరుపుకోవాలని అన్నారు. క్రైస్తవుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరులకు ఎటువంటి సహాయ సహకరాలకైనా ముందుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ లక్ష్మి వెంకట సుబ్బారావు, ఆగం రాజు ముదిరాజ్, కాసాని సుధాకర్, బాలాజీ నాయక్, సుజాత, కోఆప్షన్ మెంబర్ వాణి మరియు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, నాయకులు జగదీష్ యాదవ్, మురళి యాదవ్, సతీష్, సాంబ శివారెడ్డి, దశరథ్, స్వామి, యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్, స్పీకర్స్ జ్యోతి రాజ్, ఏసు పాదం, ఏసు పాల్, శౌరి, సత్యనారాయణ, ఈఎం చారి, పాస్టర్లు అబ్రహం, యహోషువ, రవిరాజు, జోసెఫ్, యహోషువ పుచ్చకాయలు, స్టీఫెన్ పాల్, ఎలీషా, దేవరాజు, విజయ్ పాల్, జేమ్స్, జయకుమార్, సామ్యూల్, శేతు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM