byసూర్య | Tue, Dec 06, 2022, 04:22 PM
అంబేద్కర్ ప్రపంచ మేధావిగా చెప్పుకోదగిన వ్యక్తి అని ఎమ్మార్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బోడ సునీల్ మాదిగ అన్నారు. అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని దేవరకొండ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బస్టాండ్ వద్ద దేవరకొండ మండల ఇన్చార్జ్ కొండపల్లి రమేష్ తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ నేడు అన్ని వర్గాలకు రిజర్వేషన్స్ అమలు అమలవుతున్నాయని అన్నారు. సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగల హక్కుల కోసం పోరాడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు పోతం సహదేవులు, కో కన్వీనర్ గిరిధర్, మారేపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.