తెలంగాణలో భూకంపం.. ఎక్కడంటే?
byసూర్య |
Tue, Dec 06, 2022, 11:03 AM
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో భూకంపం వచ్చింది. కోహీర్ మండలం బిలాల్పూర్ లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మంగళవారం వేకువ జామున 3.20 గంటల సమయంలో భూకంపం వచ్చింది. రిక్కర్ స్కేల్పై 3.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నల్గొండకు 117 కి.మీ దూరంలో, భూమికి 5 కి.మీ లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. గతంలో కూడా కోహీర్ మండలంలో పలుచోట్ల భూకంపం కనిపించిన విషయం తెలిసిందే.
Latest News