ఇంధన ధర సర్దుబాటు పేరుతో...ప్రజలపై త్వరలో కొత్త బాధుడు

byసూర్య | Mon, Dec 05, 2022, 11:40 PM

విద్యుత్ వినియోగదారులపై మరింత భారం వేసేందుకు డిస్కంలు సిద్దమయ్యాయి. ఛార్జీలను పెంచకుండా ఇంధన ధర సర్దుబాటు ఛార్జీని కరెంట్ బిల్లులో అదనంగా వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కరెంట్ బిల్లులలో ఈ ఛార్జీలను కలపాలని నిర్ణయించాయి. యూనిట్‌పై 30 పైసలు ఎఫ్‌సీఏ వసూలు చేయాలని భావిస్తున్నాయి. ఇంధన, బొగ్గు ధరల ఆధారంగా యూనిట్‌పై 30 పైసలు వసూలు చేయనున్నట్లు డ్రాఫ్ట్‌ ఫైల్‌లో డిస్కంలు పేర్కొన్నాయి.


ఎఫ్‌సీఏ ఛార్జీల రూపంలో విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.22,000 కోట్ల వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. డిస్కంల ప్రతిపాదనలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ కూడా ఆమోదం తెలిపింది. ఎఫ్‌సీఏ కోసం ప్రత్యేక అకౌంట్ మెయింటెన్ చేయాలని సూచించింది. నెలవారీగా ఖాతా వివరాలను సమర్పించాలని డిస్కంలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆదేశించింది. డిస్కంల ప్రతిపాదనకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆమోదం తెలపగా.. ప్రభుత్వం కూడా ఆమోదించలేదు.


విద్యుత్ సంస్థలు అప్పుల భారంతో కట్టుమిట్టాడుతుండటంతో.. ప్రభుత్వం కూడా టీఎస్‌ఈర్సీసీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పుల భారం నుంచి తమను బయటపడేసేందుకు సబ్సిడీలు ఇవ్వాలని డిస్కంలు ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరుతున్నాయి. ఇప్పటికే అన్ని డిస్కంలు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో కరెంట్ బిల్లులో ఎఫ్‌సీఏ ఛార్జీ వసూలు చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఎన్నికలు సమీపిస్తున్న వేళ విద్యుత్ ఛార్జీల పెంపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం లేకపోవడం, ఈ ఏడాది మార్చిలో ఇప్పటికే ఛార్జీలను పెంచడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఛార్జీలను పెంచకూడదని డిస్కంలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వచ్చే ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీల టారిఫ్‌లలో ఎలాంటి మార్పులు చేయకుండా ఎఫ్‌సీఏ ఛార్జీల రూపంలో వసూలు చేయనున్నాయి. దీని వల్ల ఏప్రిల్ నుంచి కరెంట్ బిల్లు పెరిగే అవకాశముంది.


ఇదిలావుంటే ఈ ఏడాది మార్చిలో డొమెస్టిక్ కస్టమర్లకు యూనిట్‌పై 50 పైసలు, నాన్ డొమెస్టిక్ కస్టమర్లకు యూనిట్‌పై రూ.1 పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ సారి ఎన్నికలు ఉండటంతో పెంపుకు డిస్కంలు ఆసక్తి చూపలేదు. దీంతో విద్యుత్ వినియోగదారులకు కాస్త ఊరట కలిగిందని అనుకున్న సమయంలో.. ఇప్పుడు ఎఫ్‌సీఏ ఛార్జీల రూపంలో అదనపు వడ్డనకు డిస్కంలు రెడీ అయ్యాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఎఫ్సీఏ ఛార్జీలను నెలవారీ బిల్లులో వసూలు చేయనున్నారు.



Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM