byసూర్య | Fri, Dec 02, 2022, 09:05 PM
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్, ఏపీ సీఎం జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది తెలంగాణలో భూకబ్జాలకు పాల్పడ్డారని వెల్లడించారు. మాదాపూర్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలకు పాల్పడ్డారని వివరించారు.ఆ ఆస్తులకు సంబంధించిన ఆధారాలను కూడా చూపిస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు.