మనస్తాపంతో భర్త ఆత్మహత్య

byసూర్య | Fri, Dec 02, 2022, 10:46 AM

ప్రేమించి పెళ్లి చేసుకున్న మూడు నెలలకే భార్యభర్తల మధ్య జరిగిన చిన్న గొడవతో భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ కిషోర్ తెలిపిన వివరాల మేరకు. చిలకలగూడ చింతబావికి చెందిన జస్వంత్ (26) అలేఖ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత నెల 30న భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆమె కుటుంబ సభ్యులు అలేఖ్యను తీసుకెళ్లారు. దీంతో జస్వంత్ మనస్తాపానికి గురై సోదరుడికి వాట్సాప్ మెసేజ్ చేసి ఇంట్లోని సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు సీతారాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, మృతుడి ఇంట్లో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM